ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మృగాళ్ల పైశాచికత్వానికి మూడేళ్ల చిన్నారి బలైంది. బాలికను అత్యాచారం చేసిన కీచకులు... తర్వాత చిన్నారి తలను శరీరం నుంచి వేరు చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి...
భర్తతో గొడవపడిన ఓ మహిళ... తన కూతురిని తీసుకుని మరో వ్యక్తితో శుక్రవారం రాత్రి టాటానగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. భయాందోళనకు గురైన మహిళ... తన కూతురు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు వచ్చిన వ్యక్తిపై అనుమానాలు ఉన్నట్టు వెల్లడించింది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.