తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2020, 7:06 PM IST

Updated : Mar 7, 2020, 8:17 PM IST

ETV Bharat / bharat

భారత్​లో మరో ముగ్గురికి కరోనా.. 34కు చేరిన కేసులు

దేశంలో మరో ముగ్గురికి కరోనా సోకినట్లు గుర్తించారు. తమిళనాడులో ఒకరు, జమ్ముకశ్మీర్​ లద్దాఖ్​లో ఇద్దరికి వైరస్​ నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 34కు చేరింది. మరోవైపు కరోనా వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. నిర్బంధ కేంద్రాల ఏర్పాటు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై అధికారులతో మాట్లాడారు.

3 more cases have been found positive
భారత్​లో మరో ముగ్గురికి కరోనా

భారత్​లో మరో ముగ్గురికి కరోనా

దేశంలో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా మరో ముగ్గురికి ఈ మహమ్మారి సోకినట్లు గుర్తించారు అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 34కు చేరింది.

కొత్తగా నమోదైన మూడు కేసులు.. తమిళనాడు(1), జమ్ముకశ్మీర్​లోని లద్దాఖ్​(2) ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒమన్​ దేశం నుంచి రాగా, లద్దాఖ్​లో వైరస్​ బారిన పడిన వారు ఇరాన్​కు వెళ్లివచ్చినట్లు తేలింది.

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

మోదీ సమీక్ష..

దేశంలో కరోనా వ్యాప్తిపై అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిర్బంధ కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. ఈ వైరస్​ మరింత వ్యాప్తి చెందినట్లయితే అత్యవసర చికిత్సపై నియమాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు.

ఇదీ చూడండి: ఇరాన్​లోని 300మంది భారతీయులకు కరోనా?

Last Updated : Mar 7, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details