ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు.. అదే నమ్మకంతో మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనుకున్నారో ఏమో! ఘరానా దొంగల అవతారం ఎత్తారు బాధ్యత గల పోలీసులు. చివరకు అడ్డంగా దొరికి సస్పెండయ్యారు.
గోరఖ్పుర్లోని మహారాజ్గంజ్కి సమీపంలోని పాడ్లీ గంజ్ వద్ద ఆభరణాల చోరీ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఊహించని మలుపులు ఎదురయ్యాయి. పోలీసు సిబ్బందే దొంగతనానికి పాల్పడ్డారని తెలిసి అవాక్కయ్యారు. అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు సహోద్యోగులు.
ఘరానా పోలీసులు..
గోరఖ్పుర్ నుంచి లఖ్నవూకు దీపక్ వర్మ, రాజు వర్మలు బుధవారం ఉదయం బస్సులో బయలుదేరారు. పాడ్లీ గంజ్ ప్రాంతంలో బస్సును అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులు లోపలికి ప్రవేశించి దీపక్, రాజులను కిందికి దింపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరిద్దరినీ నౌషద్ అనే ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టి నగదు, బంగారం, వెండి బ్యాగులు లాక్కుని.. అక్కడి నుంచి పరారయ్యారు.