తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ లాంచ్​పాడ్లను ఆక్రమించిన ఉగ్ర మూకలు!

భారత సరిహద్దు వెంట ఉన్న పాక్ లాంచ్​పాడ్​లను ఉగ్రమూకలు ఆక్రమించుకున్నట్లు సమాచారం అందిందని ప్రకటించారు సైనిక మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.

By

Published : Jul 11, 2020, 3:00 PM IST

Updated : Jul 11, 2020, 3:32 PM IST

pak
పాక్ లాంచ్​పాడ్​లపై ఉగ్ర ఆక్రమణ

భారత సరిహద్దు వెంట ఉన్న పాకిస్థాన్ లాంచ్​పాడ్​లను ఉగ్రవాదులు ఆక్రమించుకుంటున్నారని సైనిక మేజర జనరల్ వీరేంద్ర వత్స్ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు.

"పాక్ లాంచ్​పాడ్​లు పూర్తిస్థాయిలో ఆక్రమణకు గురయ్యాయి. మా అంచనా ఏమిటంటే ముష్కరుల సంఖ్య 250-300 మంది ఉండవచ్చని సమాచారం."

-మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్, మేజర్ జనరల్, 19 ఇన్​ఫాంట్రీ దళం

భారత సరిహద్దులో ఉగ్రమూకలు ఆక్రమణలకు పాల్పడ్డ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దును కట్టుదిట్టం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:ఇక ఒకే పీపీఈ కిట్​ను మళ్లీమళ్లీ వాడొచ్చు!

Last Updated : Jul 11, 2020, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details