తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓ కూలీ నుంచి 2,484 వెండి నాణేలు స్వాధీనం - అరబిక్​ చెందిన వెండి నాణేలు

మధ్యప్రదేశ్​లో ఓ వ్యక్తి నుంచి దాదాపు 27 కిలోల బరువున్న 2,484 పురాతన వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ఇంటి వెనుక భాగంలో గుంటను తవ్వగా ఈ నాణేలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

2,484 antique silver coins worth Rs 14L recovered from labourer in Madhya Pradesh
ఓ వ్యక్తి నుంచి 2,484 వెండి నాణేలు స్వాధీనం

By

Published : Sep 28, 2020, 8:50 PM IST

Updated : Sep 28, 2020, 9:06 PM IST

మధ్యప్రదేశ్ బార్వానీ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద 27 కిలోల బరువున్న 2,484 పురాతన వెండి నాణేలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని రోజుకూలీగా గుర్తించారు. తన ఇంటి వెనుక భాగంలో తవ్వినప్పుడు పురాతన నాణేలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

వెండి నాణేలు

నాణేల విషయాన్ని బయటకు పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు ఆ కూలీ. వీటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్థానికంగా ఉన్న ఇన్​ఫార్మర్​కు ఈ విషయం తెలియటం వల్ల అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు కార్మికుడి నుంచి నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

నాణేలను పరీక్షించగా వాటిపై అరబిక్​ భాషలో కొన్ని అక్షరాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఏ కాలానికి చెందినవో తెలియరాలేదని పోలీస్​ అధికారి రూప్రేఖా యాదవ్​ తెలిపారు. దాదాపు వీటి విలువ 14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వీటిని పురావస్తుశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఈ నాణేలపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Sep 28, 2020, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details