తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నౌకా దళంలో కరోనా కలకలం- 26 మందికి వైరస్

ముంబయి పశ్చిమ నావల్​ కమాండ్​లోని 26 మంది నావికా సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరిని నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.

By

Published : Apr 18, 2020, 10:32 AM IST

Updated : Apr 18, 2020, 12:02 PM IST

21 Navy personnel in Western Naval Command test positive for coronavirus
21 మంది నావికా సిబ్బందికి కరోనా పాజిటివ్​

భారత నౌకా దళంలో కరోనా కలకలం రేపింది. 26 మంది సిబ్బందికి వైరస్​ సోకినట్లు తేలింది. వీరు ముంబయిలోని పశ్చిమ నావల్​ కమాండ్​లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

"ముంబయి నావిక దళంలోని మొత్తం 26 మంది సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్​​గా నిర్ధరణ అయ్యింది. వీరిలో 25 మంది ఐఎన్​ఎస్​ అంగ్రేకి చెందిన వారు."

-భారత నౌకా దళం ప్రకటన.

ముంబయిలోని నౌకా దళానికి చెందిన ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

కుటుంబసభ్యులకూ...

బాధితుల్లో 25 మంది ఐఎన్​ఎస్​ బ్లాక్​లో, మరొకరు తన తల్లితో కలిసి సొంత ఇంటిలో నివసిస్తున్నారు. సొంత ఇంటిలో ఉంటున్న వ్యక్తి తల్లికి పరీక్షలు నిర్వహించగా వైరస్​ సోకినట్లు తేలింది. ఈ తరుణంలో వారు నివసించే ప్రాంతాన్ని 'కంటైన్​మెంట్ జోన్​'గా ప్రకటించారు. అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని నిర్బంధ కేంద్రానికి తరలించారు.

ఆ సైనికుడి నుంచే..

ఏప్రిల్​ 7న ఓ సైనికుడికి వైరస్​ లక్షణాలు కనిపించగా, అతడికి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్​గా​ నిర్ధరణ అయ్యింది. సదరు వ్యక్తి నుంచే అందరికి సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

సైన్యంలో 8 మందికి..

భారత సైన్యాన్నీ వైరస్ వదల్లేదు. ఇప్పటి వరకు 8 మంది సైనికులు వైరస్​ బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు వైద్యులు, ఒకరు నర్సు కాగా.. మిగిలిన వారు జవాన్లు. ప్రస్తుతం వీరంతా కోలుకుంటున్నారు.

అమెరికా, ఫ్రాన్స్​లోనూ...

అమెరికా నౌకా దళంలోనూ వైరస్​ వ్యాప్తి చెందుతోంది. ఆ దేశానికి చెందిన థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ విమాన వాహక నౌకలో 500 మందికి వైరస్ సోకింది. ఫ్రాన్స్​ నౌకా దళ సిబ్బందీ కరోనా బారినపడ్డారు.

Last Updated : Apr 18, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details