విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం దెబ్బతీయడానికి వామపక్ష విద్యార్థి సంఘాల కోటరీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు పలు విశ్వవిద్యాలయాల వీసీలు సహా 200 మందికి పైగా విద్యావేత్తలు. సమస్యను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యా సంస్థల్లో వామపక్ష అరాచకానికి వ్యతిరేక ప్రకటన పేరుతో రాసిన ఈ లేఖను ప్రధానికి పంపించారు.
"విద్యార్థి రాజకీయాల పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని ఇటీవల మేం గమనించాం. దీని వెనక వామపక్ష ఎజెండా ఉంది. జేఎన్యూ, జామియా, అలీగఢ్, జాదవ్పుర్ వర్సిటీల్లో ఇటీవల జరిగిన పరిణామాలు.. వర్సిటీల్లో క్షీణిస్తున్న విద్యావాతావరణానికి సూచిక. దీని వెనక వామపక్షీయుల రహస్య ఎజెండా దాగుంది."