కేరళ అలప్పుళలోని పున్నమద సరస్సులో 2019 నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పడవ పోటీల్లో మాస్టర్ బ్లాస్టర్ మెరుపులు
కేరళలో ఏటా జరిగే పడవ పోటీలు... ఈసారీ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సచిన్ తెందూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పడవ పోటీల్లో మాస్టర్ బ్లాస్టర్ మెరుపులు
ఈ 67వ పడవ పోటీలతోనే ఛాంపియన్స్ బోట్ లీగ్(సీబీఎల్) కూడా మొదలైంది. సీబీఎల్ను రాష్ట్ర పర్యటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రారంభించారు. చున్దన్ వల్లం, చురులన్ వల్లం, వెప్పు వల్లం సహా వివిధ రకాలకు చెందిన 79 పడవలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
పడవల రేస్ చూసేందుకు స్థానికులు, పర్యటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చూడండి:-ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!
Last Updated : Sep 29, 2019, 12:02 AM IST