తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు తీవ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

By

Published : May 30, 2019, 6:06 PM IST

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు తీవ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి భద్రత దళాలు. తాజాగా బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతం డంగెర్​పొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాలపైకి తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు దీటుగా స్పందించారు. ఈ భీకర పోరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మృతిచెందిన ఉగ్రవాదుల నుంచి భద్రతా సిబ్బంది భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు ఏ సంస్థకు చెందినవారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:'గంగలో మునిగితే ఇక అంతే సంగతులు'

ABOUT THE AUTHOR

...view details