తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జల్లికట్టులో విషాదం- గోడ కూలి ఇద్దరు మృతి - గోడ కూలి ఇద్దరు మృతి జల్లికట్టు

తమిళనాడులో జల్లికట్టు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. భవనం గోడ కూలి ఓ వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి గాయాలయ్యాయి. అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహించినట్లు తెలుస్తోంది.

2 killed, many injured as roof collapsed at Eruthu Vidum Vizha in Krishnagiri
జల్లికట్టులో విషాదం- పైకప్పు కూలి ఇద్దరు మృతి

By

Published : Jan 10, 2021, 9:36 PM IST

Updated : Jan 10, 2021, 10:19 PM IST

తమిళనాడులో జల్లికట్టు జరుగుతుండగా ఓ భవనం గోడ కూలి ఓ వృద్ధుడితో పాటు ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. క్రిష్ణనగరిలోని నేరాలగిరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి.

ప్రమాద దృశ్యాలు

ఎలా జరిగిందంటే..

అధికారుల ముందస్తు అనుమతి లేకుండానే గ్రామంలో జల్లికట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎద్దులను తీసుకొచ్చారు. కొన్నింటిని వీధుల్లోనే వదిలేశారు. ఎద్దుల కొమ్ములకు కట్టిన బహుమతులను దక్కించుకునేందుకు పోటీదారులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొత్తగా నిర్మించిన భవనం గోడ కూలిపోయింది.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా జల్లికట్టును కొనసాగించడం గమనార్హం.

ఇదీ చదవండి:మాజీ ఎమ్మెల్యేపై దాడి- వీడియో వైరల్​

Last Updated : Jan 10, 2021, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details