తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24 లక్షలమంది చిన్నారులపై వరదల ప్రభావం! - భారత వరదలు

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని 24లక్షలమంది చిన్నారులపై వరదల ప్రభావం పడిందని యూనిసెఫ్​ అంచనా వేసింది.

2.4 million children affected by recent floods in India: UNICEF
24లక్షల చిన్నారులపై వరదల ప్రభావం!

By

Published : Jul 24, 2020, 5:28 AM IST

Updated : Jul 24, 2020, 7:25 AM IST

భారత్​లోని 24లక్షలమంది చిన్నారులపై తాజా వరదలు ప్రభావం చూపించాయని యూనిసెఫ్​ అంచనా వేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణమే సహాయం చేయాలని, ముప్పు ప్రాంతాల్లో పరిస్థితులను శాశ్వతంగా చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచించింది.

భారత్​లో ప్రతి ఏటా ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని.. కానీ జులైలో ఈ స్థాయిలో వరదలు బీభత్సం సృష్టించడం అసాధారణమని పేర్కొంది యూనిసెఫ్​.

"భారత్​లోని బిహార్​, అసోం, ఒడిశా, గుజరాత్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, కేరళ, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ రాష్ట్రాల్లోని 60లక్షల మంది వరదల బీభత్సానికి ప్రభావితమయ్యారు. వీరిలో 24లక్షలమంది చిన్నారులు ఉన్నారు."

--- యూనిసెఫ్​.

ఇదీ చూడండి:-ముంచుతున్న నిర్లక్ష్యం 'వరద'

కరోనా సంక్షోభం, కరోనా కట్టడికి విధించిన నిబంధనలకు వరదలు తోడవడం వల్ల పరిస్థితులు దారుణంగా మారాయని యూనిసెఫ్​ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వరదల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని తక్షణమే రక్షించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు​ పేర్కొంది. ఈ మేరకు అనేక రాష్ట్రాల్లో చిన్నారుల అరోగ్య సేవలకు మద్దతిస్తున్నట్టు తెలిపింది.

ఇదీ చూడండి:-ఆపత్కాలంలో భారత్​కు అండగా ఉంటాం: ఐరాస

Last Updated : Jul 24, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details