భారత్లోని 24లక్షలమంది చిన్నారులపై తాజా వరదలు ప్రభావం చూపించాయని యూనిసెఫ్ అంచనా వేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణమే సహాయం చేయాలని, ముప్పు ప్రాంతాల్లో పరిస్థితులను శాశ్వతంగా చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచించింది.
భారత్లో ప్రతి ఏటా ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని.. కానీ జులైలో ఈ స్థాయిలో వరదలు బీభత్సం సృష్టించడం అసాధారణమని పేర్కొంది యూనిసెఫ్.
"భారత్లోని బిహార్, అసోం, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లోని 60లక్షల మంది వరదల బీభత్సానికి ప్రభావితమయ్యారు. వీరిలో 24లక్షలమంది చిన్నారులు ఉన్నారు."