తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2020, 6:11 PM IST

Updated : Feb 28, 2020, 10:01 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​ గ్రనేడ్​ దాడిలో తొమ్మిది మందికి గాయాలు

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో సీఆర్​పీఎఫ్​ సిబ్బందిపై గ్రనేడ్​ దాడి జరిగింది. రద్దీగా ఉండే లాల్​ చౌక్​ ప్రాంతానికి సమీపంలోని ప్రతాప్​ పార్క్ వద్ద ఉన్న జవాన్లపై దాడికి తెగబడ్డారు తీవ్రవాదులు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఏడుగురు పౌరులు గాయపడ్డారు.

2 CRPF jawans, 7 civilians injured in grenade attack in Kashmir
సీఆర్పీఎఫ్​ బలగాలపై గ్రనేడ్​ దాడి... తొమ్మిది మందికి గాయాలు..

సీఆర్పీఎఫ్​ బలగాలపై గ్రనేడ్​ దాడి... తొమ్మిది మందికి గాయాలు..

జమ్ముకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ బలగాలపై జరిగిన గ్రనేడ్​ దాడిలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఏడుగురు పౌరులున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఆదివారం మధ్యాహ్నం శ్రీనగర్​ లాల్​ చౌక్​ ప్రాంతంలోని ప్రతాప్​ పార్క్ వద్ద ​ఒక్కసారిగా గ్రనేడ్​ దాడి జరిగింది. అక్కడ ఉన్న జవాన్లే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు తీవ్రవాదులు. దీనితో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం లాల్​ చౌక్​ ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

Last Updated : Feb 28, 2020, 10:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details