సజ్జన్ పిటిషన్పై సీబీఐ స్పందన కోరిన సుప్రీం 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ బెయిల్ పిటిషన్ విచారణపై వివరాలు తెలపాలని సీబీఐ స్పందన కోరింది సుప్రీంకోర్టు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్కు దిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్ 17న జీవిత ఖైదు విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జన్. ఈ బెయిల్ పిటిషన్పై ఈ నెల 15న వాదనలు విననుంది సర్వోన్నత న్యాయస్థానం.
1984 దిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో అప్పటి సిట్టింగ్ ఎంపీ సజ్జన్ కుమార్ది ప్రముఖపాత్ర అని కోర్టుకు తెలిపింది సీబీఐ.
"సిక్కుల ఊచకోత మహానేరం. సజ్జన్ కుమార్కు బెయిల్ మంజూరు చేస్తే... అది న్యాయవ్యవస్థకే అవమానం. ఆయన దిల్లీ పటియాలా హౌస్ కోర్టులో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు."
- తుషార్ మెహతా, సీబీఐ అధికారి
ఇందిరాగాంధీ హత్యతో అల్లర్లు
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఇద్దరు 'సిక్కు' అంగరక్షకులు హత్య చేశారు. ఈ ఘాతుకానికి వ్యతిరేకంగా దిల్లీలో నవంబర్ 1, 2 తేదీల్లో పెద్ద ఎత్తున సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఈ మారణహోమంలో వందలాది మంది సిక్కులు చనిపోయినట్లు దిల్లీ హైకోర్టు పేర్కొంది.