ఉత్తర్ప్రదేశ్ మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భదోహీ జిల్లాలో 19ఏళ్ల యువతిపై స్థానిక కార్పెట్ ఫ్యాక్టరీ ఉద్యోగి అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత శనివారం.. అస్వస్థతకు గురైన బాధితురాలని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఈ విషయం బయటకు వచ్చింది. బాధితురాలు మూడు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు.