బిహార్లో భారీ వర్షాల కారణంగా.. మంగళవారం పలు చోట్ల పిడుగులు పడి 15 మంది మరణించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో.. వీలైనంత వరకు ప్రజలను బయటకు రావొద్దని కోరారు నితీశ్.
పిడుగుల బీభత్సం.. మరో 15 మంది మృతి - Bihar Lightning strike news'
బిహార్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుల ధాటికి మంగళవారం ఒక్కరోజే 15 మంది బలయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం నితీశ్ కుమార్.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.
ఆ రాష్ట్రంలో పిడుగుల బీభత్సం.. మరో 15 మంది మృతి!
పిడుగుల ధాటికి బిహార్వ్యాప్తంగా నెలరోజుల వ్యవధిలో 180 మందికిపైగా చనిపోయారు. వీరిలో జూన్ 25 నాడే 83 మంది(23 జిల్లాల్లో) ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:నవంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ టీకా.. ధరెంతంటే?