తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదానికి దారులు మూసేస్తోన్న సర్కారు!

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తోన్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జమ్ముకశ్మీర్​కు చెందిన 13 మంది ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు గుర్తించింది జాతీయ దర్యాప్తు సంస్థ. అందులో హిజ్బుల్​ ముజాహిదీన్​ వ్యవస్థాపకుడు సయ్యద్​ సలాహుద్దీన్​, హురియత్​ నాయకులు ఉన్నారు.

By

Published : Mar 24, 2019, 8:03 PM IST

Updated : Mar 24, 2019, 8:55 PM IST

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న 13 మందిని గుర్తించిన ఎన్​ఐఏ

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న 13 మందిని గుర్తించిన ఎన్​ఐఏ
పుల్వామా దాడి అనంతరం ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా అన్ని దారులను అన్వేషిస్తోంది. వారికి సాయం అందిస్తున్నట్లు 13 మందిని గుర్తించాయి భద్రతా సంస్థలు. అందులో హిజ్బుల్​ ముజాహిదీన్​ వ్యవస్థాపకుడు సయ్యద్​ సలాహుద్దీన్​, హురియత్​ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.

దేశ వ్యతిరేక చర్యలు, విధ్వంసాలు సృష్టించటం, రాళ్ల దాడులు వంటివి చేయటానికి స్థానిక యువతను ప్రేరేపిస్తున్నారు ఉగ్రవాదులు. యువతను తప్పుదోవ పట్టించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

మొదటి చర్యల్లో భాగంగా గురుగ్రామ్​లోని జహూర్​ అహ్మద్​ షా వతాలి భవనాన్ని జప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్​ నుంచి డబ్బులు పొందిన ఆరోపణలతో ప్రస్తుతం జహూర్​ తిహార్​ జైలులో ఉన్నాడు.

జాబితాలో ఉన్న పేర్లు

మోహద్​ యుసఫ్​ షా అలియాస్​ సయ్యద్​ సలాహుద్దీన్ (హిజ్బుల్​)​, హఫీజ్​ సయీద్​ ( జమాత్​ ఉల్​ దావా), అఫ్తాబ్​ అహ్మద్​ షా అలియాస్​ ఫంతూశ్​ ( తహ్రీక్​ ఈ హూరియత్​), సయ్యద్​ గిలాని, మహమ్మద్​ నయీమ్ ఖాన్​, ఫరూఖ్​ అహ్మద్​ దార్​, అక్బర్​ ఖండేయ, మెహ్రజూద్దీన్​ కల్వాల్​, బషీర్​ అహ్మద్​ భట్​, సైఫుల్లా, నవాల్​ కిశోర్​ కపూర్​, జహూర్​ అహ్మద్​ షా

Last Updated : Mar 24, 2019, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details