తెలంగాణ

telangana

బంగాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు.. 13 మంది మృతి

పశ్చిమ బంగలో వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13మంది మృతి చెందారు. మరో పదకొండు మందికి గాయాలయ్యాయి.

By

Published : Aug 15, 2019, 7:31 PM IST

Published : Aug 15, 2019, 7:31 PM IST

Updated : Sep 27, 2019, 3:07 AM IST

బంగాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు.. 13 మంది మృతి

బంగాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు.. 13 మంది మృతి

పశ్చిమ బంగలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 13మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయ పడ్డారు.

కారు చెరువులో పడి...

పశ్చిమ బంగ దక్షిణ 24 పర్గనాస్​ జిల్లాలో ఉదయం 6 గంటల సమయంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా మెుత్తం ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఖతర్​ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బంధువుని కోల్​కతా విమానాశ్రయం నుంచి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది.

కారు, లారీ ఢీకొని...

పశ్చిమ బంగ బక్కార్​పూర్ వద్ద 34వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరిని మాల్డా వైద్య కళాశాలకు తరలించారు. మరో ఆరుగురిని కోల్​కతా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారని స్థానిక ఎస్​పీ ఆలోక్​ రాజోరియా తెలిపారు. బాధితులు ఓ వివాహ వేడుకకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చూడండి:దొంగలను తరిమికొట్టిన వృద్ధులకు సాహస పురస్కారం

Last Updated : Sep 27, 2019, 3:07 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details