తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి - దిల్లీలో కుప్పకూలిన భవనం

దిల్లీలోని భజన్​పురా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి యజమాని సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.

building collapses in Delhi's Bhajanpura
కుప్పకూలిన భవనం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు

By

Published : Jan 25, 2020, 6:46 PM IST

Updated : Feb 18, 2020, 9:38 AM IST

కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి

దిల్లీలోని భజన్​పురా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు, యజమాని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రికి చేర్పించగా.. ఐదుగురు మృతి చెందారు. మరో 8 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఘటనలో మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ గల్లంతైంది. వీరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

"ఇవాళ సాయంత్రం 4.30 గంటల సమయంలో భవనం కుప్పకూలింది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు."
- అతుల్​ గార్గ్​, దిల్లీ ఫైర్​ సర్వీస్​ చీఫ్​

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: నల్లని ఆకారం చూసి ఆగిన వృద్ధుడి గుండె!

Last Updated : Feb 18, 2020, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details