తెలంగాణ

telangana

ETV Bharat / bharat

102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

హిమాచల్​ప్రదేశ్​కు చెందిన 102 ఏళ్ల శ్యాం నేగి దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేశారు. మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.

By

Published : Mar 13, 2019, 3:43 PM IST

102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

దేశంలో 18 ఏళ్లకే ఓటు వేయటానికి అవకాశం ఉంది. అయినా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోరు. పోలింగ్​ శాతం పెంచేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం. ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఓటు విలువను తెలియచెప్పేందుకు తిరుగులేని ఉదాహరణగా నిలిచారు మాజీ ఉపాధ్యాయుడు శ్యాం నేగి. వయసు 102. స్వస్థలం హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లా కల్పా. స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన తీర్పును బ్యాలెట్​లో, ఈవీఎంలో నిక్షిప్తం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్​లో మే 19న లోక్​సభ ఎన్నికలు. మరోమారు ఓటేసేందుకు సిద్ధమయ్యారు శ్యాం నేగి.

102 ఏళ్ల వయస్సులో మరోసారి ఓటు హక్కు వినియోగించుకోవటం చాలా సంతోషంగా ఉంది. - శ్యాం నేగి

ABOUT THE AUTHOR

...view details