మహారాష్ట్ర భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఐసీయూ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగటమే కారణంగా తెలుస్తోంది. ఘటన జరగిన సమయంలో మొత్తం 17 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
అర్ధరాత్రి సమయంలో ఐసీయూ గది నుంచి దట్టమైన పొగ బయటకి రావటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది తలుపులు తెరిచారు. అప్పటికే గది మొత్తం పొగతో నిండిపోయింది. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి, అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఎస్ఎన్ఐసీలో అవుట్ బార్న్, ఇన్బార్న్ అని రెండు విభాగాలు ఉండగా.. అవుట్బార్న్లో ఉన్న 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన చిన్నారుల్లో ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో ఏడుగుగురు పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరో ఏడుగురు చిన్నారులను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. ఇతర రోగులను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో 10మంది నవజాత శిశువుల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిశువుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. శిశువులు మరణించడం ఎంతో దురదృష్టకరమని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఈ వార్త తనను ఎంతో బాధించిందని తెలిపారు.
బాధితులను ఆదుకోవాలి..