తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా కేసులన్నీ సుప్రీంకు బదిలీ చేయండి' - సీరం సుప్రీంకోర్టు

కరోనా టీకాకు సంబంధించిన కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారత్​ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్​ వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ నెల 18న ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

SC
కరోనా టీకా కేసుల బదిలీ కోసం భారత్​ బయోటెక్, సీరం వ్యాజ్యం

By

Published : Mar 15, 2021, 3:06 PM IST

Updated : Mar 15, 2021, 3:27 PM IST

కరోనా టీకాపై కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాయి సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు. దిల్లీ, ఇతర హైకోర్టుల్లో కేసులు సుప్రీంకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాయి.

సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనంలో ఈ వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. అన్నీ సుప్రీంకు తీసుకురావడం లేదా.. ఏదైనా హైకోర్టుకు బదిలీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

అయితే.. కీలకాంశాన్ని సుప్రీంలోనే విచారించాలని పిటిషనర్లు కోరారు. ముఖ్యంగా.. దిల్లీ హైకోర్టులోని కేసును సుప్రీంకు బదిలీ చేయాలని అభ్యర్థించింది భారత్‌ బయోటెక్‌. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

జడ్జిలు, లాయర్లకు టీకా ఇవ్వాలన్న పిటిషన్‌తో కలిపి.. ఈ వ్యాజ్యంపై ఈ నెల 18న విచారిస్తామని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి:-'ముక్కు ద్వారా కరోనా టీకా'పై ట్రయల్స్!

Last Updated : Mar 15, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details