తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2021, 7:51 PM IST

ETV Bharat / bharat

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల 'భారత్​ బంద్'

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు శుక్రవారం భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బంద్​ నుంచి మినహాయింపు ఉంటుందని రైతు సంఘాలు తెలిపాయి.

'Bharat Bandh': Rail, road transport likely to be affected in parts of country
'భారత్​ బంద్'తో రైళ్ల రాకపోకలకు అంతరాయం?

సాగు చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా మార్చి 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని సూచించాయి.

రైలు, రోడ్డు రవాణా సహా మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను మూసి వేయాలని కోరిన రైతు సంఘాలు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బంద్‌ పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకూ బంద్​ నుంచి మినహాయింపు కల్పించారు.

" రైళ్ల రాకపోకలతో పాటు.. రోడ్డు రవాణాను అడ్డుకుంటాం. కార్మిక, రవాణా, ఇతర సంఘాలు ఈ బంద్​కు మద్దతు ప్రకటించాయి."

- బల్బీర్ సింగ్ రాజేవాల్, రైతు నేత

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

ఇదీ చదవండి:'రైతు ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదు'

ABOUT THE AUTHOR

...view details