తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక ఐపీఎస్​కు హోదా తగ్గింపు.. మరొకరికి పదోన్నతి - డైమండ్ హార్బర్ ఎస్పీ భోలనాథ్ పాండే

జేపీ నడ్డా కాన్వాయ్​పై దాడి సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరికి పదోన్నతి కల్పించిన బంగాల్ ప్రభుత్వం.. మరొకరి హోదా తగ్గించింది. మూడో అధికారి హోదాను యథాతథంగా ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

west bengal ips officer
ఒక ఐపీఎస్​కు హోదా తగ్గింపు.. మరొకరికి పదోన్నతి

By

Published : Dec 29, 2020, 9:19 AM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై బంగాల్​లో దాడి జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం ఒకరి హోదా తగ్గించగా.. మరొకరికి పదోన్నతి కల్పించింది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అదికారులను బదిలీ చేయగా.. 13 మందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

డైమండ్ హార్బర్ జిల్లా ఎస్పీ భోలనాథ్ పాండే హోదాను తగ్గించి.. హోమ్ గార్డ్ ఎస్పీగా నియమించింది. దక్షిణ బంగాల్ ఐజీగా ఉన్న రాజీవ్ మిశ్రాకు పదోన్నతి కల్పించి అదే జోన్​కు అదనపు డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఘటన సమయంలో విధుల్లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రెసిడెన్సీ రేంజి డీఐజీగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో నడ్డా కాన్వాయ్​పై ఈ నెల 13న రాళ్లతో దాడి జరిగింది. ఆ సమయంలో భద్రతా విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీకి కేంద్రం ఆదేశించినప్పటికీ.. బంగాల్ ప్రభుత్వం ససేమిరా అంది.

ఇదీ చదవండి:జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details