తెలంగాణ

telangana

పద్మభూషణ్​ అవార్డును తిరస్కరించిన బంగాల్ మాజీ సీఎం

By

Published : Jan 25, 2022, 10:57 PM IST

Padma Awards 2022: బంగాల్​ మాజీ సీఎం బుద్ధదేవ్​ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డును స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ పురస్కారం గురించి తనకు ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు.

Ex-Bengal CM Buddhadeb Bhattacharjee
Ex-Bengal CM Buddhadeb Bhattacharjee

Padma Awards 2022: భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్​ పురస్కారాన్ని స్వీకరించేందుకు బంగాల్​ మాజీ సీఎం బుద్ధదేవ్​ భట్టాచార్య తిరస్కరించారు.

"ఈ అవార్డు గురించి నాకు ఏమీ తెలియదు. దాని గురించి ఎవరూ చెప్పలేదు. వారు(ప్రభుత్వం) నాకు పద్మభూషణ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే.. నేను దానిని స్వీకరించేందుకు నిరాకరిస్తున్నాను" అని బుద్ధదేవ్​ ఓ ప్రకటనలో తెలిపారు. భట్టాచార్య, పార్టీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ(ఎం) వర్గాలు తెలిపాయి.

అయితే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ కార్యాలయానికి చెందిన ఓ సీనియర్​ అధికారి ద్వారా అవార్డు గురించి బుద్ధదేవ్​ కుటుంబానికి తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2022 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దేశ తొలి సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్‌(మరణానంతరం), యూపీ మాజీ సీఎం దివంగత కళ్యాణ్ సింగ్​, ప్రభ ఆత్రే, మహారాష్ట్రశ్రీ రాధేశ్యామ్​ ఖామ్కే(మరణానంతరం), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్​, సీపీఐ(ఎం) నేత బంగాల్​ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ గౌరవం పొందిన వారి జాబితాలో ఉన్నారు.

ఇదీ చూడండి:Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..

ABOUT THE AUTHOR

...view details