తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయమూ చేస్తాం.. ఆందోళనలూ కొనసాగిస్తాం' - Bharatiya Kisan Union leader

నూతన సాగు చట్టాలను రద్దు చేసేంతవరకు దిల్లీ సరిహద్దులను దాటి వెళ్లేది లేదని భారతీయ కిసాన్​ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. ఎంతటి త్యాగాలకైనా రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హరియాణాలో నిర్వహించిన కిసాన్​ మహాపంచాయత్​లో ఆయన పాల్గొన్నారు.

Be ready to sacrifice your standing crop: Tikait to farmers
రాకేశ్ టికాయికత్

By

Published : Feb 18, 2021, 9:11 PM IST

రైతులు తమ పొలాలను చూసుకునేందుకు వెళ్లిపోతారని.. దీంతో రైతు ఉద్యమం ముగిసిపోతుందనే భ్రమలో కేంద్రం ఉండొద్దని భారతీయ కిసాన్​ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​ హెచ్చరించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను సైతం తగలబెట్టడానికైనా రైతులు సిద్ధంగా ఉన్నారని టికాయిత్​ ప్రకటించారు. చట్టాలను రద్దు చేసేంత వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు.

'రైతులుగా మేము వ్యవసాయమూ చేస్తాం.. ఆందోళనలూ కొనసాగిస్తాం' అని టికాయిత్​ ఉద్ఘాటించారు. చట్టాలు రద్దు చేసేంతవరకు 'ఘర్​వాపసీ'ఉండబోదని కుండబద్దలు కొట్టారు. హరియాణా హిసార్​ జిల్లా పరిధి ఖరక్​పూనియా గ్రామంలో నిర్వహించిన కిసాన్​ మహాపంచాయత్​లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రైతు సంఘాలు తదుపరి పోరాటానికి పిలుపునిచ్చే ఆందోళనల్లో పాల్గొనేందుకు అన్నదాతలు సమాయత్తం కావాలని టికాయిత్​ సూచించారు. ఏ సమయంలోనైనా పిలుపు రావొచ్చని.. దిల్లీకి ప్రయాణించడానికి ట్రాక్టర్లలో ఇంధనాన్ని నింపి సిద్ధంగా ఉండాలన్నారు.

రాబోయే రోజుల్లో గుజరాత్, బంగాల్​, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సైతం 'కిసాన్​ మహాపంచాయత్​' నిర్వహించనున్నట్టు తెలిపారు.

బంగాల్​కు ఆందోళనలు..

ప్రభుత్వం దిగి రాకుంటే ట్రాక్టర్లలో రైతులు.. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న బంగాల్​వైపు మళ్లి ఆందోళనలు చేస్తారని భారతీయ కిసాన్‌ యూనియన్ నేత రాకేశ్‌ టికాయిత్‌ వెల్లడించారు. బంగాల్‌లో కూడా రైతులు ఇక్కట్లలో ఉన్నారని, వారి తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బంగాల్‌లో నెల రోజుల పాటు పోరాటం చేసేందుకు వీలుగా రైతులు సిద్ధం కావాలని టికాయిత్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనీయం: టికాయిత్​

ABOUT THE AUTHOR

...view details