వెదురు ఆకుల నుంచి ఆహ్లాదపరిచే టీ తయారు చేస్తున్నారు త్రిపురకు చెందిన గిరిజన వ్యాపారి సమీర్ జమాతియా. ఈ పానీయానికి ఛాయ్ ప్రియులు సహా ఇతర రాష్ట్రాల్లోని వర్తకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.
గోమటి జిల్లా గర్జీకి చెందిన సమీర్.. బ్యాంబూ సాంకేతిక నిపుణుడు. ఉద్యోగ రీత్యా చైనాలో చాలా కాలం నివసించారు. జపాన్, వియత్నాం, కాంబోడియాలోనూ పర్యటించారు. అక్కడ సంపాదించిన అనుభవంతో వెదురు టీని తయారు చేస్తున్నారు.
ఎగుమతులకు ఆదరణ..