తెలంగాణ

telangana

By

Published : May 6, 2021, 4:46 PM IST

ETV Bharat / bharat

ఒక్కరాత్రిలో 200 మంది ప్రాణాలు కాపాడిన కరోనా యోధులు

కరోనా యోధుల చొరవతో కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో అతిపెద్ద ప్రమాదం తప్పింది. రాత్రికి రాత్రే ఆక్సిజన్​ ఏర్పాటు చేసి, 200 మంది ప్రాణాలను కాపాడారు. ఇందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వంత్​ నారాయణ్​ కూడా పాలుపంచుకోవడం విశేషం. అసలేం జరిగిందంటే..?

Corona warriors
కరోనా యోధులు

కర్ణాటకలో బెంగళూరులో 200 మంది ప్రాణాలను కాపాడారు కరోనా యోధులు. నగరంలోని కేసీ జనరల్​ ఆస్పత్రిలో 200 మంది కరోనా రోగులు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు. క్రమంగా ఆక్సిజన్​ తగ్గిపోవడం మొదలైంది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్య సిబ్బంది.. రాత్రి 11 గంటలకు ప్రొక్సీ కంపెనీకి ఫోన్​ చేసి, ఆక్సిజన్​ సరఫరా చేయమని కోరారు. బళ్లారి నుంచి ఓ ట్యాంకర్​ను పంపింది ఆ సంస్థ. అయితే రాత్రి 11.30 గంటలైనా ఆ ట్యాంకర్​ రాలేదు. దురదృష్టవశాత్తూ.. కేసీ ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్​ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిపోయింది. మరోవైపు ఆక్సిజన్​ తగ్గిపోయింది.

కరోనా యోధులు

రంగంలోకి డిప్యూటీ సీఎం

దీంతో ఆస్పత్రిలో ఆక్సిజన్​ నిర్వహణ ఇన్​ఛార్జి​ డాక్టర్​ రేణుకా ప్రసాద్​కు సమాచారం అందించారు సిబ్బంది. ఆయన మరోసారి ప్రొక్సీ కంపెనీకి ఫోన్​ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఉపముఖ్యమంత్రి డాక్టర్​ సీఎన్​ అశ్వంత్​ నారాయణ్​కు ఫోన్​ చేశారు ప్రసాద్​. రంగంలోకి దిగిన డీసీఎం ఎక్కడెక్కడ ఆక్సిజన్​ అందుబాటులో ఉందో తెలుసుకుని.. చివరకు యూనివర్సల్​ కంపెనీ నుంచి ప్రాణవాయువు సరఫరా చేసే​ ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించి.. ట్రాఫిక్​ అంతరాయం లేకుండా అతివేగంగా జంబో ఆక్సిజన్​ సిలిండర్లు ఆస్పత్రికి చేరుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

దీంతో తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రాణావాయువు ఆస్పత్రికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది మొత్తం ఆ వార్డుకు చేరుకుని.. రోగులకు ఆక్సిజన్ అందించారు. అంతా సర్దుమణిగాక ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:వైద్యం వికటించి ఎనిమిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details