తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.98 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్న జాంబియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి నుంచి రూ.98 కోట్లు విలువచేసే డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Apr 16, 2021, 11:17 AM IST

Authorities seize drugs, Indira Gandhi International Airport
డ్రగ్స్​ స్వాధీనం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను తరలిస్తూ గురువారం ఇద్దరు జాంబియా దేశస్థులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.98 కోట్లు విలువ చేసే 14 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు.

సౌతాఫ్రికాలోని జోహన్నెస్​బర్గ్​ నుంచి ఖతార్​ గుండా పయనిస్తూ వారు భారత్​కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:మధ్య సీటు ఖాళీతో కరోనా ముప్పు తక్కువే!

ABOUT THE AUTHOR

...view details