తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్టీలో చేరనందుకే నా మంత్రిపై బాంబు దాడి' - బంగాల్

బంగాల్​లో రాష్ట్ర​ మంత్రిపై బాంబు దాడికి సంబంధించి సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పార్టీలో చేరమని మంత్రిని ఒత్తిడి చేసి అందుకు నిరాకరించేసరికి బాంబు దాడి చేశారని మమతా అన్నారు.

Bengal minister a conspiracy
'ఓ పార్టీలో చేరమని ఒత్తిడి- అందుకే మంత్రిపై బాంబు దాడి'!

By

Published : Feb 18, 2021, 7:55 PM IST

బంగాల్​ మంత్రి జాకీర్​ హుస్సేన్​పై బాంబు దాడిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ పార్టీలో చేరవలసిందిగా హుస్సేన్​ని ఒత్తిడి చేశారని పరోక్షంగా భాజపాను విమర్శించారు. ఆ కుట్రలో భాగంగానే మంత్రిపై బాంబు దాడి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్​ఎస్​కేఎమ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని మమతా పరామర్శించారు.

"బాంబు దాడి రైల్వే స్టేషన్​ సమీపంలో జరిగింది. రైల్వేస్టేషన్​ ఈ దాడికి బాధ్యత వహించదని చెప్పడం ఏంటి? రైల్వే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు. రైల్వే శాఖ కేంద్రం పరిధిలోనిది. మా(రాష్ట్ర) పరిధిలో లేదు. ఈ కేసు సీఐడీతో పాటు రాష్ట్ర తిరుగుబాటు వ్యతిరేక దళం( ఎస్​టీఎఫ్​) కూడా దర్యాప్తు చేస్తుంది."

- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని భాజపా ఆరోపించింది. బాంబు దాడికి సంబంధించి రైల్వేశాఖను మమత నిందించడాన్ని తప్పుబట్టింది.

"రాష్ట్ర పాలన రైల్వేశాఖ చేస్తుందా? అలాంటి ఆరోపణలు నిలువలేవు. సీఎంగా, హోంమంత్రిగా మమత విఫలమయ్యారు."

-జైప్రకాశ్​ మజుందర్​, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయలపాలైన వారికి రూ. లక్ష పరిహారంగాసీఎం ప్రకటించారు.

ఇదీ చూడండి:షా పర్యటనకు ముందు బంగాల్​లో ఉద్రిక్తత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details