తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు పిల్లల విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం - ప్రభుత్వ పథకాలపై అసోం ముఖ్యమంత్రి

ప్రభుత్వ పథకాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని అనుసంధానం చేస్తున్నామని అసోం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనను క్రమంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రవేశపెడతామని తెలిపారు.

two child policy for govt schemes,
'ఇలా అయితేనే పథకాలకు ప్రజలు అర్హులు'

By

Published : Jun 19, 2021, 4:33 PM IST

Updated : Jun 19, 2021, 7:40 PM IST

ఇక నుంచి ఓ కుటుంబంలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారని అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ శనివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు.

అయితే ఈ నిబంధన రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాలకు వర్తించదని స్పష్టం చేశారు. ఈ నిబంధనను క్రమంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రవేశపెడతామని తెలిపారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలకు సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. అయిదుగు అన్నదమ్ములు ఉన్న కుటుంబం నుంచి సీఎం వచ్చారంటూ ప్రతిపక్షాలు ఇటీవల ఎద్దేవా చేశాయి.

ఇదీ చదవండి :ఇకపై వృక్షాలకూ పింఛన్లు- వారసత్వ హోదా

Last Updated : Jun 19, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details