అసోంలో అమానుష ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని సెప్టెక్ ట్యాంక్లో పడేశాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..తిన్సుకియా జిల్లా మార్గరీటా పోలీస్ స్టేషన్ పరిధిలో అనన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలికను అనన్ రేప్ చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని సెప్టింగ్ ట్యాంగ్లో పడేశాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణాచల్ప్రదేశ్లో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పారిపోవాలని ప్రయత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు అనన్.. తన భార్యతో పాటు మార్గరీటా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతడి భార్య, బాధితురాలి తల్లి పనిమనుషులు. మే 1 మంగళవారం రోజు బాలికను అనన్ ఇంటి వద్ద ఉంచి ఇద్దరూ పనికోసం బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే బాలిక కనబడలేదు. దీనిపై అనన్ను అడగగా.. బాలిన తన సొంత ఇంటికి వెళ్లిందని చెప్పాడు. ఆ ఇంట్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.