తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గత ప్రభుత్వాల వల్లే అసోం వెనుకబడింది' - అసోం పర్యటనలో పలు ప్రాజెక్ట్​లను ప్రారంభించిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన అసోం పర్యటనలో భాగంగా చమురు, గ్యాస్​ ప్రాజెక్ట్​లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వాల పాలన వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు.

PM Narendra Modi inaugurates and lays the foundation stone of various projects in Assam
అసోం పర్యటనలో పలు ప్రాజెక్ట్​లను ప్రారంభించిన మోదీ

By

Published : Feb 22, 2021, 12:39 PM IST

అసోం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేమోజీ జిల్లాలోని శిలపతార్​లో చమురు, గ్యాస్​ ప్రాజెక్టులను ప్రారంభించి... జాతికి అంకితమిచ్చారు. వాటితో పాటు ఇంజినీరింగ్​ కళాశాలలకూ శంకుస్థాపన చేశారు. అనంతరం.. కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. కేంద్రం, అసోం ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి గొప్ప సామర్థ్యం ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వాలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయని ఈ సందర్భంగా చెప్పారు మోదీ. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు.

చమురు, గ్యాస్​ ప్రాజెక్ట్​లను ప్రారంభిస్తున్న ప్రధాని
ప్రజలకు అభివాదం తెలుపుతున్న మోదీ
మోదీ సభకు హాజరైన జనసంద్రం

ఈ కార్యక్రమంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​, అసోం సీఎం సర్బానంద సోనోవాల్​, గవర్నర్​ జగ్దీష్​ ముఖిలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నేషనల్​ హెరాల్డ్ కేసు విచారణపై దిల్లీ హైకోర్టు స్టే

ABOUT THE AUTHOR

...view details