తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. బోల్తా పడ్డ బొలేరో.. పోలీసులకు గాయాలు - కేంద్ర మంత్రి కారు ప్రమాదం వార్తలు

కేంద్ర మంత్రి కాన్వాయ్​లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. పలువురు పోలీసులు ఈ ఘటనలో గాయపడ్డారు. కేంద్ర మంత్రి స్వయంగా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Ashwini Choubey escorting vehicles overturned
Ashwini Choubey escorting vehicles overturned

By

Published : Jan 16, 2023, 7:39 AM IST

కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే కాన్వాయ్​లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనాల్లోని కొరన్​సరాయ్ పోలీసు స్టేషన్​కు చెందిన ఓ కారు బోల్తా కొట్టింది. బిహార్​లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కేంద్ర మంత్రి బక్సర్ నుంచి పట్నాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ట్విట్టర్​లో తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఘటనాస్థలిలో కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే
బోల్తాకొట్టిన కారు

మాథిలా- నారాయణ్​పుర్ రహదారిపై ఉన్న దుమ్​రావ్ వంతెనపై ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం కారును కేంద్ర మంత్రి పరిశీలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. క్షతగాత్రులను కేంద్ర మంత్రే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనలో పోలీసుల బొలేరో వాహనం క్రాష్ అయిపోయింది. వెనక ఉన్న కారు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనలో గాయపడ్డ పోలీసులను దుమ్​రావ్ సదర్ ఆస్పత్రికి తరలించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాహన డ్రైవర్​కు సైతం గాయాలయ్యాయని చెప్పారు. ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం పట్నా ఎయిమ్స్​కు తరలించారు.

ఘటనాస్థలిలో కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే
ఘటనాస్థలిలో కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే

ABOUT THE AUTHOR

...view details