Delhi Liquor Scam Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇక ఈ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అరుణ్ పిళ్లై ఇప్పటికే అరెస్టు అయిన విషయం తెలిసిందే. పలు మార్లు ఆయన ఈడీ కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా దిల్లీ మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. అరుణ్ పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. అనంతరం అరుణ్ పిళ్లైని తీహాడ్ జైలుకు తరలించారు.
ఇదే కేసులో ఇప్పటికే దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీ కూడా పలు మార్లు పొడిగిస్తూ వచ్చింది కోర్టు. తాజాగా ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ.. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మనీశ్ సిసోదియాకు ఏప్రిల్ 3 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇక సిసోదియా బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో రేపు విచారణ చేపట్టనుంది. దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం సంగతి తెలిసిందే.