తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2021, 10:34 AM IST

ETV Bharat / bharat

రక్షణ శాఖ వెబ్​సైట్ల హ్యాకింగ్​కు చైనా యత్నం!

భారత ప్రభుత్వంలోని కీలక వెబ్​సైట్లను హ్యాక్​ చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఇటీవల బంగాల్​లో పట్టుబడిన చైనా చొరబాటుదారుడు వెల్లడించాడు. అందుకోసం తమ దేశంలోని పలు ఏజెన్సీలు పని చేస్తున్నాయని తెలిపాడు.

china
హ్యాంకింగ్​కు చైనా యత్నం

బంగాల్​ మాల్దా జిల్లాలో ఇటీవల పట్టుబడిన చైనా చొరబాటుదారుడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తమ దేశానికి చెందిన పలు ఏజెన్సీలు.. భారత ప్రభుత్వంలోని రక్షణ శాఖ సహా ఇతర కీలక వెబ్​సైట్లను హ్యాక్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. రక్షణ శాఖ, బీఎస్​ఎన్​ఎల్​తో సంబంధం ఉన్న బెంగళూరుకు చెందిన ఓ సంస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడని అతని కేసును పరిశీలిస్తున్న ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​ అధికారులు చెప్పారు.

భారత్​-బంగ్లాదేశ్​ సరిహద్దు మీదుగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో హాన్​ జున్వే అనే చైనా పౌరుడిని 10 రోజుల కింద.. భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ కేసును ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​ దర్యాప్తు చేపట్టింది. అతని మొబైల్​ ఫోన్​, ల్యాప్​టాప్​​ను అన్​లాక్​ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

" చైనా ఏజెన్సీల లక్ష్యాల్లో పలు వైమానిక సంస్థలు కూడా ఉన్నాయి. భారత రక్షణ వ్యవస్థలోని సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే రక్షణ శాఖ పరిధిలోని వెబ్​సైట్ల హ్యాకింగ్​కు యత్నిస్తున్నారు. ఆయా ఏజెన్సీలతో జున్వే సంబంధాలు, భారత్​లో అతను చేస్తున్న పనులు తెలుసుకునేందుకు ఎస్​టీఎఫ్​ ప్రయత్నిస్తోంది. అతను ఎక్కడికి వెళ్లాలనుకున్నాడో ఇంకా తెలియరాలేదు. మాల్దాలోని కలియాచక్​లో అతని కోసం ఎవరో వేచి ఉన్నారని భావిస్తున్నాం. "

- ఎస్​టీఎఫ్​ అధికారి.

చైనీయుడికి నిషేధిత మావోయిస్టు దళాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ ఎస్​టీఎఫ్​ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించటంలోనూ అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:చైనా గూఢచారి.. పదేళ్లుగా భారత్​లోనే..!

చైనా గూఢచారి ఫోన్ పాస్​వర్డ్​ తీయలేకపోతున్నారా?

ABOUT THE AUTHOR

...view details