తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2021, 10:57 AM IST

ETV Bharat / bharat

ఇసుక కూలీ వద్ద అరుదైన దుర్గాదేవి విగ్రహం

నదిలో ఇసుక తోడే ఓ కూలీ వద్ద నుంచి అరుదైన దుర్గాదేవి(Goddess Durga) విగ్రహాన్ని జమ్ముకశ్మీర్​ పోలీసులు(Jammu and Kashmir Police) స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం దాదాపు 1,200 ఏళ్ల క్రితం నాటిదని అధికారులు తెలిపారు.

1200 yr old godess durga sculpture
దుర్గాదేవీ విగ్రహం

1,200 ఏళ్ల క్రితం నాటి అరుదైన దుర్గాదేవి విగ్రహాన్ని(Goddess Durga) కశ్మీర్ బుద్గాం జిల్లాలో పోలీసులు(Jammu and Kashmir Police) స్వాధీనం చేసుకున్నారు. జీలం నదిలో ఇసుక తోడే ఓ కూలీ వద్ద దీన్ని వారు గుర్తించారు. పక్కా సమాచారంతో.. ఖాన్​సాహిబ్​ ప్రాంతంలోని ఆ వ్యక్తి వద్దకు చేరుకుని, సోదాలు చేసి ఈ విగ్రహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

1200 ఏళ్ల నాటి విగ్రహం
విగ్రహాన్ని పరిశీలిస్తున్న అధికారులు
దుర్గాదేవి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారికి అప్పగిస్తున్న జమ్మకశ్మీర్​ పోలీసులు

12 సెంటిమీటర్ల పొడవు 8 సెంటిమీటర్ల వెడల్పుతో.. సింహంపై దుర్గాదేవి ఆసీనులై ఉన్నట్లుగా ఈ విగ్రహం చెక్కి ఉంది. ఆగస్టు 31న ఇసుక తరలిస్తుండగా తనకు ఈ విగ్రహం దొరకిందని సదరు కూలీ పేర్కొన్నాడు. ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్​ ముస్తాక్​ అహ్మద్​ బేగ్​కు బుద్గాం ఎస్ఎస్​పీ తాహీర్ సలీం ఖాన్​ అప్పగించారు. ఇది దాదాపు క్రీస్తు శకం 7-8వ శతాబ్దం కాలం నాటికి చెందిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details