వేటగాళ్లు ఏర్పాటు చేసిన నాటు బాంబును కొరికి ఒడిశాలో మరో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన గంజాం జిల్లా కుకుడాహాండీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. అడవి పందులను వేటాడేందుకు పొలాల్లో నాటు బాంబులను ఏర్పాటు చేశారు వేటగాళ్లు. గోమాత బాంబును కొరికింది. దీంతో ఆవు నోరు పేలి చెల్లాచెదురైంది.
వేటగాళ్ల ఘాతుకం- మరో ఆవు నోట్లో పేలిన బాంబు
వేటగాళ్ల ఘాతుకానికి ఒడిశాలో మరో గోమాత గాయాలపాలైంది. అడవి పందులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన నాటు బాంబును కొరికి ఆవు తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నోటిలో నాటుబాంబు పేలి గోమాతకు తీవ్ర గాయాలు
Last Updated : Jan 6, 2021, 10:53 PM IST