తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు మరోమారు అమెరికా భారీ సాయం

కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్​కు మరోసారి సాయం ప్రకటించింది అమెరికా. 25 మిలియన్​ డాలర్లను అందించనున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ తెలిపారు.

By

Published : Jul 28, 2021, 7:29 PM IST

US Secretary of State Antony Blinken
అమెరికా సాయం

కొవిడ్​ రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్​కు అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. భారత టీకా పంపిణీ కార్యక్రమానికి మద్దతుగా 25 మిలియన్​ డాలర్లు(రూ.186 కోట్లు) సాయం కింద అందిస్తున్నట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​.

" భారత కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ కార్యక్రమానికి అమెరికా సాయం కింద అదనంగా 25 మిలియన్​ డాలర్లను అందిస్తున్నాం. భారత్​వ్యాప్తంగా టీకా సరఫరా గొలుసును బలోపేతం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అమెరికా సాయం ఉపకరిస్తుంది."

- ఆంటోనీ బ్లింకెన్​, అమెరికా విదేశాంగ మంత్రి.

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్​కు వచ్చిన బ్లింకెన్​.. బుధవారం విదేశాంగ మంత్రి జైశంకర్​ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా తొలినాళ్లలో భారత్​ చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు భారత్​కు తిరిగి సాయం చేయటం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.

కరోనాను ఎదుర్కొనేందుకు జూన్​లో 41 మిలియన్​ డాలర్లను భారత్​కు సాయంగా అందించింది అమెరికా. తాము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్​కు అండగా నిలుస్తామని యూఎస్​ ఏజెన్సీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ తెలిపింది.

మోదీతో భేటీ..

భారత పర్యటనలో ఉన్న బ్లింకెన్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల బంధం బలోపేతంపై బైడెన్‌ చిత్తశుద్ధిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు మోదీ.

ఇదీ చూడండి:'కరోనాపై పోరుకు భారత్​, అమెరికా​ నాయకత్వం'

ABOUT THE AUTHOR

...view details