తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మావోయిస్టులకు దీటైన సమాధానమిస్తాం' - బీజాపూర్​ ఘటనపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

ఛత్తీస్​గఢ్​లోని భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. బీజాపుర్‌ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో నిర్వహించిన ఈ సమీక్షకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు షా.

Amit Shah holds high-level security meeting
ఛత్తీస్​గఢ్​లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

By

Published : Apr 4, 2021, 11:34 PM IST

ఛత్తీస్​గఢ్​లో భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజాపుర్‌ ఎన్​కౌంటర్​లో 23 మంది జనవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర హోం కార్యదర్శి అజయ్​ భల్లా, కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్​ అరవింద్​ కుమార్​, హోం మంత్రిత్వ శాఖ, సీఆర్​పీఎఫ్​ సీనియర్​ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్​కౌంటర్ ఘటనతో అసోంలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని దిల్లీ చేరుకున్నారు షా. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​తో మాట్లాడిన షా.. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

మావోయిస్టులు రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.అమరులైన జవాన్ల త్యాగాలు ఎన్నటికీ వృథా పోవని స్పష్టం చేశారు.

12మంది నక్సల్స్​ మృతి

శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్స్​ మృతిచెందినట్లు బస్తర్​ ఐజీ సుందర్​ రాజ్​ తెలిపారు. మరో 16 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. ఓ మహిళా నక్సలైట్​ను పట్టుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details