తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్​కి వేసినట్టే: అమిత్‌షా - సంగారెడ్డి జిల్లాలో అమిత్‌షా ప్రచారం

Amit Shah Election Campaign in Telangana : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. అది బీఆర్ఎస్​కు వేసినట్టేనని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

Amit Shah Election Campaign in Telangana
Amit Shah Election Campaign Today

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 7:53 PM IST

Amit Shah Election Campaign in Telangana: రాష్ట్రంలో ఎన్నికల్లో కీలక ఘట్టంమైన పోలింగ్ మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నందున.. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు హామీలతో ఓటులు అడిగేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకు సంబంధించిన జాతీయ నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరుఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తదితర ప్రముఖ బీజేపీ నాయకులు ప్రచారంలో బిజిగా ఉన్నారు.

Amit Shah Election Campaign Today : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో బీజేపీ(BJP) నాయకులు నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థినే సీఎం చేస్తామని మళ్లీ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్​పుట్ సబ్సిడీ ఇస్తామని.. ప్రజారోగ్యం కోసం 10 లక్షల బీమా కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఉప్పల్​లో అమిత్ షా రోడ్​ షో- బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్

Amit Shah Telangana Tour :ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ ప్రభుత్వం పెంచిందని అమిత్ షా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్(BRS) కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.

"రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుంది. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. 2021లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అంటే బీజేపీ రావాలి. 370 ఆర్టికల్​ని కాంగ్రెస్ అడ్డుకున్నా.. మోదీ సర్కారు రద్దు చేసింది."- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది : అమిత్ షా

Amit Shah Comments on BRS Government :నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. నిరుద్యోగులకు భృతి ఇస్తామని, ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. 2.50 కోట్ల మందికి కేంద్రం ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడ పేపర్ లీక్(Paper Leak) కాలేదని అన్నారు. తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీకులు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్​కు ఓట్లు అడిగే అర్హత లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​కి ఓటేస్తే.. బీఆర్ఎస్​కు వేసినట్టేనని అమిత్ షా ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది బీఆర్ఎస్​లోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల సొత్తు లూటీ - అందుకే కేసీఆర్​ను గద్దె దించాలని తెలంగాణ ఫిక్స్ అయింది : అమిత్​ షా

బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్​ షా

ABOUT THE AUTHOR

...view details