బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి ఎలా గాయమైందో ఇప్పటికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ ఘటనను టీఎంసీ 'దాడి'గా అభివర్ణిస్తుంటే.. ఎన్నికల సంఘం మాత్రం ప్రమాదవశాత్తు జరిగినట్టు చెబుతోందని వ్యాఖ్యానించారు.
రాణిబంద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమిత్ షా. ఈ నేపథ్యంలో మమత పాలనపై విరుచుకుపడ్డారు. కాలి నొప్పితోనే చక్రాల కుర్చీలో తిరుగుతున్నానంటున్న దీదీ.. టీఎంసీ పాలనలో చనిపోయిన 130మంది భాజపా కార్యకర్తల తల్లుల బాధను ఎప్పుడు పట్టించుకుంటారని ప్రశ్నించారు.
'కుట్ర అనను...'