తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 1:38 PM IST

ETV Bharat / bharat

వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్

దేశంలో ఇప్పటివరకు 7.9 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. లఖ్​నవూలో యూపీ​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. మధ్యప్రదేశ్​లో ఓ 118 ఏళ్ల వృద్ధురాలు టీకా తీసుకుని దేశంలోనే టీకా తీసుకున్న అత్యధిక వయస్కురాలిగా నిలిచారు. మరోవైపు పంజాబ్​లోని లూధియానాలో ప్రజల సౌకర్యార్థం.. వ్యానుల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడి అధికారులు.

vaccinaton in india
పంజాబ్​లో మొబైల్​ వ్యాక్సినేషన్​ కేంద్రాలు

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.9 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 16,38,464 టీకా డోసులు అందించినట్లు చెప్పింది.

టీకా​ తీసుకున్న 118 ఏళ్ల వృద్ధురాలు

మధ్యప్రదేశ్​లోని సాగర్​ జిల్లాలో తుల్సాబాయ్​ అనే 118 ఏళ్ల వృద్ధురాలు.. కొవిడ్​ టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారు. దేశంలో ఇప్పటివరకు​ టీకా తీసుకున్నవారిలో తుల్సాబాయే అత్యధిక వయస్కురాలు కావటం గమనార్హం. అంతకుమందు బెంగళూరుకు చెందిన జె.కామేశ్వరి(103).. పేరిట ఈ రికార్డు ఉండేది.

కరోనా టీకా వేయించుకుంటున్న 118 ఏళ్ల వృద్ధురాలు తుల్సాబాయ్​

టీకా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్​

ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. లఖ్​నవూ సివిల్​ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్​ కేంద్రంలో ఆయన టీకా వేయించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ నిబంధనలను పాటించాలని​ కోరారు.

టీకా వేయించుకుంటున్న ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

వ్యానుల్లో వ్యాక్సినేషన్​..

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వైరస్​ కట్టడి కోసం పంజాబ్​లోని లూధియానా జిల్లా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఆర్​టీ- పీసీఆర్​ పరీక్ష కేంద్రాలను కియోస్క్​ల రూపంలో ఏర్పాటు చేశారు. అలాగే.. వ్యానుల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పంజాబ్​లోని లూధియానాలో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
పంజాబ్​లో మొబైల్​ వ్యాక్సినేషన్​ కేంద్రాలు

"త్వరలోనే 200 వ్యాక్సినేషన్​ వ్యానులను మేం ఏర్పాటు చేస్తాం. మాస్కులు లేకుండా కనిపించిన వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్​ బృందాలను మేం రంగంలోకి దించుతున్నాం."

-సివిల్​ సర్జన్​, లూధియానా

ఉచిత భోజనం..

గుజరాత్​ రాజ్​కోట్​లోని టీకా పంపిణీ కేంద్రంలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసింది ఓ స్వచ్ఛంద సంస్థ. "వ్యాక్సిన్​ తీసుకున్నాక ఇంటికి వెళ్లి, ప్రజలు వంట కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేం బ్రేక్​ఫాస్ట్, లంచ్​, డిన్నర్​ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో టీకా తీసుకున్న తర్వాత వారు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోగలరు." అని సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తెలిపారు.

టీకా పంపిణీ కేంద్రం వద్ద వంట చేస్తున్న స్వచ్ఛంద సంస్థ సిబ్బంది
వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద భోజన వసతి

జవాన్లకు రెండో డోసు..

జమ్ముకశ్మీర్ రామ్​బాగ్​లోని వ్యాక్సినేషన్​ కేంద్రంలో సీఆర్​పీఎఫ్​ జవాన్లు కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు.

రామ్​బాగ్​లోని టీకా పంపిణీ కేంద్రంలో ఎదురు చూస్తున్న సీఆర్​పీఎఫ్​ జవాన్లు
టీకా రెండో డోసు వేయించుకుంటున్న సీఆర్​పీఎఫ్​ జవాన్​

దేశంలో కరోనా విజృంభణ ఆందోళనకరంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే.. 1,03,558 మంది.. వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి:'జోధ్​పుర్​ ఐఐటీ'పై కొవిడ్​ పంజా

ABOUT THE AUTHOR

...view details