తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం ఆధ్వర్యంలో ఆన్​లైన్​ క్లాసులు షురూ - కేరళ విద్యా సంవత్సరం ప్రారంభం

కేరళలో 1-9వ తరగతులకు ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తరగతులను ప్రారంభించారు. 10 - 12వ తరగతి విద్యార్థులకు జూన్​ 7న ఆన్​లైన్ క్లాసులు మొదలు కానున్నాయని విద్యా శాఖ తెలిపింది. ​

kerala school reopening, కేరళ విద్యా సంవత్సరం ప్రారంభం
డిజిటల్​ క్లాసులను ప్రారంభించిన సీఎం

By

Published : Jun 1, 2021, 4:28 PM IST

మహమ్మారి వేళ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సారానికి ఆన్​లైన్​ వేదికగా శ్రీకారం చుట్టారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. మంగళవారం నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో భాగంగా సీఎం.. 1-9వ తరగతి పిల్లలకు ఆన్​లైన్​ క్లాసులను ప్రారంభించారు. ఫస్ట్​ బెల్​ పోర్టల్​లోని కైట్​ విక్టర్స్​ ఛానెల్​ ద్వారా పాఠాలు వినే వెసులుబాటు కల్పించారు.

"విద్యార్థులు స్కూల్​ బ్యాగ్స్​, కొత్త బట్టలతో పాఠశాలలకు వచ్చే సమయం త్వరలోనే వస్తుంది. మహమ్మారి కారణంగా ఇంట్లోనే విద్యను అభ్యసిస్తున్నా.. మనం అందరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే దిశగా అడుగులు వేయచ్చు. రాష్ట్రం అనుసరిస్తున్న డిజిటల్​ విద్యా విధానం విజయవంతమైనది."

-పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

ఈ కార్యక్రమంలో మొత్తం 45 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని విద్యాశాఖ వెల్లడించింది. 10 - 12వ తరగతి విద్యార్థులకు జూన్​ 7 నుంచి ఆన్​లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయని తెలిపింది. 1-4 తరగతి విద్యార్థులకు ఉచిత యూనిఫాం​, పుస్తకాల పంపిణీ చేశామని పేర్కొంది.

ఇదీ చదవండి :వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాల్సిందే: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details