తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ - Congress president Sonia Gandhi

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హత కలిగిన వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ప్రధాని మోదీని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ మేరకు ప్రధానికి ఓ లేఖ రాశారు.

Allow emergency use of more COVID-19 vaccines, expand vaccination based on need: Sonia to PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ

By

Published : Apr 12, 2021, 10:12 PM IST

కరోనా విజృంభణ దృష్ట్యా సామర్థ్యం కలిగిన టీకాలను వెంటనే అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం ప్రధానికి లేఖ రాశారు.

"దేశీయంగా టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. దాంతో పాటే అర్హత కలిగిన అన్ని వ్యాక్సిన్​లకు అత్యవసర వినియోగం కోసం త్వరితగతిన అనుమతినివ్వాలి. టీకాల లభ్యత పెరిగినప్పుడు.. వయస్సుతో సంబంధం లేకుండా అవసరం ఆధారంగా వ్యాక్సినేషన్ చేయాలి. అదే విధంగా.. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్రాలకు టీకాలను అందించాలి."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

కరోనా కట్టడికి ఆంక్షల నేపథ్యంలో అర్హులైనవారికి ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని కోరారు సోనియా. ఈ మేరకు కనీస నెలవారీ వేతన హామీ కింద ఒక్కొక్కరికి రూ.6 వేలు అందజేయాలని చెప్పారు. అలాగే కొవిడ్​19 చికిత్స కోసం వినియోగించే పరికరాలు, మందులపై జీఎస్టీ మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:14న గవర్నలతో ప్రధాని, ఉప రాష్ట్రపతి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details