తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం జడ్జి నివాస సిబ్బంది మొత్తానికి కరోనా - సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా

సుప్రీం కోర్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే కోర్టులోని 40 మందికిపైగా కరోనా సోకగా.. తాజాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా అధికారిక నివాసంలోని సిబ్బంది అందరికీ వైరస్​ పాజిటివ్​గా తేలింది.

Supreme court
సుప్రీం కోర్టు

By

Published : Apr 15, 2021, 2:10 PM IST

Updated : Apr 15, 2021, 2:26 PM IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా.. అధికారిక నివాసంలో పని చేసే సిబ్బంది అందరూ కరోనా బారినపడ్డారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఆ విషయాన్ని వెల్లడించారు జడ్జి.

జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనంలో ఉన్న ఆయన.. తన అధికారిక నివాసంలోని సిబ్బందికి కరోనా వైరస్​ సోకినట్లు న్యాయవాదులకు తెలిపారు. కరోనా పరిస్థితులను అదుపు చేసేందుకు తగినంత సమయం తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు అదనపు సొలిసిటర్​ జనరల్​ ఐశ్వర్యా భాటి.

కొద్ది రోజుల క్రితమే సుప్రీం కోర్టులోని 40 మందికిపైగా సిబ్బంది కరోనా బారినపడ్డారు.

సుప్రీంకోర్టు.. ప్రస్తుతం వర్చువల్​గా కేసుల విచారణ చేపడుతోంది.

ఇదీ చూడండి:దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ- మాల్స్​, జిమ్​లు మూసివేత

Last Updated : Apr 15, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details