గుజరాత్లో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో అహ్మదాబాద్లోని పార్కులు, గార్డెన్లను పూర్తిస్థాయిలో మూసేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నిబంధన అమలువుతుందని స్పష్టం చేసింది. కంకారియా సరస్సు, జంతుప్రదర్శనశాలనూ మూసివేయనున్నట్లు పేర్కొంది.
ఇటీవలే నాలుగు మెట్రో నగరాల్లో రాత్రి పూట పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లో అధికంగా కేసులు వెలుగుచూస్తున్నాయి.