Akhilesh Yadav on BJP: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా క్రమంగా కూలిపోతోందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. భాజపాలో ఒక్కో వికెట్ పడిపోతోందని.. అయినా ముఖ్యమంత్రికి క్రికెట్ ఆడటం చేతకాదని ఎద్దేవా చేశారు. భాజపాకు రాజీనామా చేసిన నేతలను ఎస్పీలో శుక్రవారం చేర్చుకున్న సందర్భంగా అఖిలేశ్ లఖ్నవూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మూడో వంతు సీట్లు తమకే దక్కుతాయని భాజపా అంటోందని.. దాని అర్థం ఆ పార్టీకి కేవలం మూడు లేదా నాలుగు రావడం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్వామిప్రసాద్ మౌర్య అన్నారు. నిజమే.. ఈ సారి మా పార్టీకి చాలా మంది నేతలు తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో భాజపాకు 20 శాతం ఎస్పీకి శాతం సీట్లు దక్కేవి. కానీ మౌర్య సహా మిగతా ఎమ్మెల్యేల రాకతో ఆ 20 శాతం కూడా భాజపా పోగొట్టుకుంది. బాబా ముఖ్యమంత్రి ఓ లెక్కల మాస్టారును సంప్రదించాలి."
-అఖిలేషన్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత
భాజపాకు 80 శాతం, ఇతర పార్టీలకు 20 శాతం మద్దతు ఉంటుందని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు అఖిలేశ్.