తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ జనరల్ సెక్రటరీగా 'హోసబలే'

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ సర్​ కార్యవాహ్​గా దత్తాత్రేయ హోసబలే ఎంపికయ్యారు. శనివారం బెంగుళూరు వేదికగా అఖిల భారతీయ ప్రతినిధి సభలో పాల్గొన్న కార్యకర్తలు ఈయనను ఎన్నుకున్నారు.

By

Published : Mar 20, 2021, 1:04 PM IST

Updated : Mar 20, 2021, 1:53 PM IST

RSS sarkaryavah
ఆర్​ఎస్​ఎస్​ జనరల్ సెక్రటరీగా దత్తాత్రేయ

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్​ఎస్​ఎస్) సర్​ కార్యవాహ్​(జనరల్​ సెక్రటరీ)గా ఎంపికయ్యారు దత్తాత్రేయ హోసబలే. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో హోసబలేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకన్నట్లు ఆర్​ఎస్​ఎస్​ తమ ట్విటర్ ఖాతాలో పేర్కొంది. 2009 నుంచి ఈయన సంఘ్​ సహ సర్​ కార్యవాహ్​గా ఉన్నట్లు పేర్కొంది.

శివమొగ్గకు చెందిన హోసబలే గత జనరల్​ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 1968లో ఈయన సంఘ్​లో చేరారు. కన్నడ మ్యాగజైన్ అసీమాకు ఎడిటర్​గాను పనిచేశారు. 1975-1977 ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు హోసబలే జైలు జీవితం గడిపారు.

ఇదీ చదవండి:కాబోయే సైనికులు.. ఫుట్​పాత్​లే పాన్పులు

Last Updated : Mar 20, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details