తెలంగాణ

telangana

బిహార్​లో 'ఎంఐఎం' జోరు- ఐదు సీట్లు కైవసం

By

Published : Nov 10, 2020, 6:45 PM IST

Updated : Nov 10, 2020, 10:26 PM IST

బిహార్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహదుర్​గంజ్ నియోజకవర్గాల్లో గెలుపొందింది.

AIMIM Won 5 Seats in Bihar Election
బిహార్​లో ఎంఐఎం ప్రభంజనం- 5 స్థానాలు కైవసం

బిహార్ శాసనసభ ఎన్నికల్లో అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీ అరుదైన విజయం సాధించింది. అనూహ్యంగా ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహదుర్​గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

2019 ఉప ఎన్నికల్లో కిషన్​గంజ్​ అసెంబ్లీ స్థానం గెలుచుకోవటం మినహా బిహార్​లో ఓవైసీ పార్టీ సాధించిన గొప్ప విజయాలేవీ లేవు. తాజా విజయంతో బిహార్​లో పార్టీ ప్రభావం పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇరుకూటముల మధ్య ఆధిక్యం దోబూచులాడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ 'కింగ్ మేకర్​'గా అవతరించే అవకాశమూ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

పక్కా వ్యూహం

ముస్లిం మెజారిటీ ఉన్న స్థానాలపై దృష్టిసారిస్తూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది ఎంఐఎం. మొత్తం 32 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. రాష్ట్రంలోని సీమాంచల్​ లక్ష్యంగా పావులు కదిపింది. ముస్లింలు అత్యధికంగా ఉన్న అరరియా, క్రిష్ణగంజ్​, పూర్ణియా, కటిహర్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది.

Last Updated : Nov 10, 2020, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details