తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏపై అన్నాడీఎంకే యూటర్న్​- భాజపా పరేషాన్!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాట అధికార పార్టీ అన్నాడీఎంకే.. పౌరసత్వ చట్టం(సీఏఏ)పై తన వైఖరిని మార్చుకుంది. ప్రత్యేక తమిళ ఈలం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తోంది. మిగతా సమస్యల్లోనూ పార్టీ వ్యవస్థాపక సూత్రాలకు అనుగుణంగా వెళ్లాలని చూస్తోంది. మరోవైపు డీఎంకే కూడా లంక-తమిళుల అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చింది. తమిళవాదాన్ని బలంగా వినిపిస్తున్న ఈ ద్రవిడ పార్టీలు.. తమ సిద్ధాంతకర్తల అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం అంత సులభమేనా?

By

Published : Mar 16, 2021, 4:04 PM IST

AIADMK's no-CAA, Lankan Tamils agenda in manifesto sets the bar higher
సీఏఏ రద్దు, లంక-తమిళుల అజెండాతో ముందుకు.. కానీ!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే ప్రకటించిన మేనిఫెస్టో ఆశ్చర్యం కలిగించక మానదు. పార్లమెంటులో పౌరసత్వ చట్టానికి(సీఏఏ) అనుకూలంగా ఓటేసిన ఆ పార్టీనే.. ఇప్పుడు మేనిఫెస్టోలో సీఏఏ అమలును నిలిపివేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చింది. మరికొన్ని కీలక వాగ్దానాలతో తమిళ జాతీయవాదం వైపు అడుగులు వేస్తోంది. శ్రీలంకలోని తమిళులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక తమిళ ఈలం ఏర్పాటుకు డిమాండ్​ చేస్తోంది.

బద్ధశత్రువులైన అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే.. ఓటర్లను ఆకర్షించేందుకు అప్పటి తమ సిద్ధాంతకర్తలు పెరియార్​, అన్నాదురై బాటలో నడిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. వారి వ్యవస్థాపక సూత్రాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది ఇటీవల ఆయా పార్టీల నేతల భావాల్లో, స్వరాల్లో స్పష్టమైంది కూడా.

ఇదీ చూడండి: తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!

రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉమ్మడి సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి కూడా భాజపాతో పొత్తు ఎన్నికల వరకే పరిమితమని, సైద్ధాంతికంగా కాదని ఇటీవలే స్పష్టం చేశారు. దీనికి బలం చేకూరుస్తూ.. పార్లమెంటులో సీఏఏకు అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే... ఇప్పుడు అమలు నిలిపివేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని చెబుతోంది.

అయితే ఎన్నికలకు ముందు సీఏఏపై అధికార పార్టీ వాగ్దానం మాత్రం.. భాజపాకు చికాకు, చిక్కులు తెప్పించేదే. దీనిపై ముందుకెళ్లడం అధికార పార్టీకి అంత సులువేం కాదు. సీఏఏను రద్దు చేయాలని.. కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

లంక-తమిళుల అంశంపై..

అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకుండాపోయిందనుకున్న లంక-తమిళుల అంశాన్ని రెండు పార్టీలు మేనిఫెస్టోల్లో ప్రస్తావించాయి. శ్రీలంక శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తామని అధికార పార్టీ హామీ ఇవ్వగా.. డీఎంకే సైతం అలాంటి వాగ్దానమే చేసింది. తమిళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి అధికారాలు దక్కేలా తాము పోరాడతామని పేర్కొంది.

ఇదీ చూడండి:తమిళ రాజకీయాల్లో 'వారు' మాయం- డీఎంకేకే లాభం!

భారత్​లో ఉండాలనుకునేవారికి.. భారత పౌరసత్వం, శాశ్వత నివాస హోదా హామీపైనా రెండు పార్టీలు దాదాపు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి.

ముఖ్యంగా లంక తమిళుల అంశం.. ద్రవిడ పార్టీల రాజకీయ ప్రధాన అంశాల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ ఎన్నికలు దీనికేం మినహాయింపు కాదు. దానికి తగ్గట్లుగానే మేనిఫెస్టోల్లో సంబంధిత అంశాలను పొందుపర్చాయి.

తమిళవాదం..

తమిళానికి.. అధికారిక జాతీయ భాషా హోదా దక్కాలని ఇరు పార్టీలు కోరుకుంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం, ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు తమిళులకు దక్కేలా చట్టాన్ని తెస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.

ఇది తమిళ జాతీయవాద ఉద్యమాల్లో దీర్ఘకాలంగా వినిపిస్తున్న డిమాండ్​.

ఇదీ చూడండి:75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో

తమిళ భాషకు ప్రాధాన్యం దక్కేలా.. మద్రాస్​ హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా పేరు మార్పు, చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్​ ఏర్పాటును మేనిఫెస్టోలో చేర్చింది అన్నాడీఎంకే.

యూపీఎస్​సీ ఉద్యోగాలకు.. రాష్ట్ర స్థాయి పరీక్షల నిర్వహణ, ఇతర మతాలకు మారిన ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్​ ప్రయోజనాలు దక్కేలా చూస్తామనీ హామీనిచ్చింది.

ఇది పరీక్షే..

కాంగ్రెస్​ పాలనకు స్వస్తి పలికి.. తమిళనాట అర్ధశతాబ్దానికిపైగా అధికారంలో ఉంటూ వస్తున్నాయి రెండు ద్రవిడ పార్టీలు. ఇవి తమకుతాము దిగ్గజ ముదలియార్​ - జస్టిస్​ పార్టీ, పెరియార్​ రామస్వామి - ద్రవిడర్​ కళగం ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని, వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నాయి.

సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా.. మైనారిటీలకు సంబంధించిన సమస్యలపై, సామాజిక న్యాయసూత్రాలపై ఇరు పార్టీల వైఖరి వారి భావజాలాలకు అనుగుణంగా దాదాపు ఒక్కటే. ఈ నేపథ్యంలో.. తమిళనాడులో ఎవరు గెలిచినా.. ఈ అజెండాల అమలే కీలకం కానుంది.

ఇవీ చూడండి:5 అసెంబ్లీల ఎన్నికల్లో గెలుపు గుర్రాలేవో!

హిందుత్వ వైపు అడుగులు.. డీఎంకేలో ఈ మార్పేంటి?

'లంకలోని తమిళుల హక్కుల పరిరక్షణకు కృషి'

ABOUT THE AUTHOR

...view details